గోరువెచ్చని నీరు సేవిస్తే ఎన్నో లాభాలు

గోరువెచ్చని నీరు 100% శ్వాస సంబంధిత వ్యాధులను, తల నొప్పి, లో బీపీ, కీళ్ళ నొప్పులు,హార్ట్ బీట్, కొలెస్ట్రాల్ పెరుగుదలను, అస్తమా, పొడి దగ్గు,దగ్గు, బ్లాక్ అయిన నరాలు, కడుపు, కంటి, చెవి, గొంతు సంబంధిత వ్యాధులు అన్నింటిని నయం చేయగలవు.


ఎలా త్రాగాలి

ఉదయం పరగడుపున గోరువెచ్చని 5 గంటల సమయంలో 4 గ్లాస్ ల గోరు వెచ్చనినీరు త్రాగాలి.   నిమిషాల  వరకు ఏమి తినకూడదు.

ప్రయోజనాలు

డయాబెటిస్ 30 రోజుల్లో  కంట్రోల్ అవుతుంది.

బీపీ  30 రోజుల్లో  నియంత్రిస్తుంది.

ఉదర సంబంధిత వ్యాధులు 10 రోజుల్లో  తగ్గుతాయి.

అన్ని రకాల కాన్సర్ 9 నెలలలో తగ్గుతాయి.

నరాల బ్లాకులు 6 నెలలు తరువాత పోతాయని చెప్పు కోవచ్చు.

మూత్ర సంబంధిత వ్యాధులు 10 రోజుల్లో పోతాయి.

గొంతు, చెవి, కంటి, ముక్కు సంబంధించిన వ్యాధులు 10 రోజుల్లో తగ్గుతాయి.

స్రీల ఋతుక్రమం 15 రోజుల్లో క్రమం అవ్వగలదు.

తలనొప్పి/ మైగ్రేన్ 3 రోజుల్లో పోతాయి.

కొలెస్ట్రాల్ 4 నెలల్లో తగ్గుతుంది.

అస్తమా 4 నెలల్లో తగ్గిపోతుంది.

Share:

మోకాళ్ళ నొప్పులకు చెప్పండి ఇక బాయ్ బాయ్

కొబ్బరినూనె మంచి యాంటి ఇంఫ్లమెట్రి. దీనిని మర్దన చేస్తే మోకాళ్ళ నొప్పులు తగ్గి పోతాయి.

నిమ్మకాయ సిట్రిక్ యాసిడ్ కలిగి ఉండడం వలన యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ ను కరిగించి ఎంతో మేలు చేస్తుంది.

ఆలివ్ ఆయిల్ ఉబ్బిన మోకాళ్ళకు ఉపసమనం కలిగిస్తుంది. మోకాళ్ళ నొప్పులు  బాగా తగ్గుతాయి.



పసుపు యాంటి ఇంఫ్లమెట్రి. అది చాల  మెరుగుగా పని చేస్తుంది.

 

అల్లం టీ ని లేక అల్లం కషాయం గా చేసుకుని త్రాగితే మోకాళ్ళ వాపులు మరియు వాపులు తగ్గుతాయి.

 

ద్రాక్షా జ్యూస్ మొక్కాళ్ళ నొప్పులకు చాల మంచిది.


Share:

రోజు ఇలా చేస్తే మంచిది

ప్రతిరోజూ5 బాదం తింటే  కాన్సర్ మన దరిదాపులకు రాదు.

ప్రతిరోజూ1 నిమ్మకాయ తీసుకుంటే రాదు  ఒంట్లో కొవ్వును చేరనివ్వదు.

 

రోజు 1 గ్లాసు  పాలు త్రాగితే ఎముకల సమస్యలు తగ్గిపోతాయి.

రోజు 12 గ్లాస్ ల నీళ్ళు తీసుకుంటే చర్మ వ్యాధులు రావు.

ప్రతిరోజూ 4 ఖర్జూరాలు తీసుకుంటే నీరసం దరిచేరదు.

ప్రతి రోజు ఒక ఆపిల్ తీసుకుంటే అసలు ఏ వ్యాధి దగ్గరకు రాదు.

ప్రతిరోజూ వ్యాయామం చేస్తే ఏ వ్యాధి రాదు.

Share:

జ్వరం వస్తే సత్వరం చెయ్యండి


15-20 కృష్ణతులసి ఆకులను బండ మీద నూరిన పేస్టు + 3-4 మిరియాలు + 1 గ్లాసు నీళ్ళల్లో మరిగించి, చల్లార్చిన తర్వాత గుటక గుటకగా  త్రాగాలి.




వేపచెట్టు కొమ్మని బండ మీద నూరి + 1 గ్లాసు నీళ్ళతో కలిపి, ½ గ్లస్సు నీళ్ళు అయ్యే దాక మరిగించి, చల్లారిన తరువాత గుటక గుటకగా త్రాగాలి. ఇది చాల మంచి ఔషదం.

Share:

సోరకాయా ....... మజాకా

100 గ్రాముల సొరకాయ తింటే దాని ద్వారా సమకుఉరేది కేవలం 15 క్యాలరీలు మాత్రమే. డయాబెటిస్ ఉన్నవారు ఎక్కువగా తీసుకుంటే ఎంతో మంచిది.


సోరకాయలో తొంభై ఆరు  శాతం నీరే. ఇందులో విటమిన్ సి, రిబోఫ్లావిన్, జింక్, థయామిన్ , ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్ వంటి విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. నీరసంగా ఉన్నవారు అలసటగా ఉన్నవారు దీనిని ఎక్కువగా సేవిస్తే శక్తి తొందరగా సమకూరుతుంది.

 

100 గ్రాముల సోరకాయలో కేవలం 1 గ్రాము కొవ్వు మాత్రమే ఉంది. కాబట్టి గుండె సంబంధిత వ్యాధులున్నవారు దీనిని ఆహారంగా తీసుకోవాలి.

 

సోరకాయలో పీచు పదార్ధం ఎక్కువ పాళ్ళల్లో ఉండడం వలన మల బద్ధకం నివారిస్తుంది. గ్యాస్ సమస్యలు ఉన్నవారు దీనిని సేవిస్తే మంచిది.

 

ఉబకాయం ఉన్నవారికి  ఇందులో డయటరి ఫైబర్ ఉండడం వలన తొందరగా కడుపు నిండినట్లు అనిపిస్తుంది, అధిక బరువు తగ్గడంలో బాగా సహాయం చేస్తుంది.



సొరకాయ కాలేయానికి మేలు చేస్తుంది. దాని పని తీరుని మెరుగు పరుస్తుంది.

 

పొటాషియం బీపీని నియంత్రిస్తుంది. ఇందులో పొటాషియం ఎక్కువగా ఉండడం వలన బీపీ వున్నా వారు దీనిని విరివిగా వాడవచ్చు.  

Share:

ఇంగువ ప్రాముఖ్యత

మరిగించిన ఇంగువకు సమానంగా నల్ల ఉప్పు కలిపి చూర్ణం చేసుకోవాలి. తేనెలో పిసర గింజంతపరిమాణంలో ఈ చూర్ణం కలిపి నాకిస్తే, పిల్లలలోని కడుపు ఉబ్బరం సమస్యలు తగ్గిపోతాయి.

ఇంగువను కొంచెం వేడి చేసి పంటిలో ఉంచితే బాధ ఉపసమిస్తుంది.

పొంగించిన అర గ్రాము ఇంగువను ఆవు నెయ్యితో కలిపి ప్రతి రోజు సేవిస్తే దగ్గు తగ్గు తుంది.



10 గ్రాముల హారతి కర్పురంలో, 10 గ్రాముల పొంగించిన ఇంగువ కలిపి నూరి, కంద గింజ సైజు మాత్రలు చేసుకొని పూటకు ఒక మాత్ర చొప్పున మూడు పుఉతల వేడి నీటితో వేసుకుంటే కడుపు ఉబ్బరం నుంచి ఉపసమనం లభిస్తుంది.

పెసర గింజంత ఇంగువను నీళ్ళల్లో కరిగించి, నొప్పి ఉన్న వైపు ముక్కుల్లో మూడు చుక్కలు వేసుకొని నస్యంగా పీలిస్తే పార్శ్వపు నొప్పి తగ్గుతుంది.


ఇంగువ , సైంధవ లవణం , సొంటి ఒక్కొక్కటి 20 గ్రాముల చొప్పున తీసుకొని 30 గ్రాముల ఆవనూనె లో కలిపి నూనె మాత్రమే మిగిలేలా వేడి చేయాలి. ఆ నూనె నాలుగు చుక్కలు చెవిలో వేసుకుంటే చెవి పోటు మాయం అవుతుంది.

 

పొంగించిన ఇంగువను మంచినీళ్ళలో అరగదీసి, ఆ గంధాన్ని కాలిన చోట లేపనంగా వేస్తేకాలిన గాయాలు,బొబ్బలు మాని పోతాయి.


 

 

Share:

నడుము నొప్పి ఉందా ? అయితే ఇలా నివారిద్దాం

నూరిన అల్లం ముద్దను నడుము ఫై పూసి మర్దన చేస్తే నడుము నొప్పి తగ్గుతుంది. దీన్ని యూకలిప్ట్ నూనెతో కలిపి మర్దన చేస్తే ఇంకా మంచిది.

ఆవనూనె, నువ్వులనూనె వేడి చేసి నడుముకు మర్దన చేసు కొని వేడి నీళ్ళతో స్నానం చేస్తే నడుము నొప్పి తగ్గుతుంది.



నడుము నొప్పితో బాధ పడేవారు వంకాయ, వేరుశనగనూనె,మినప పదార్థాలు, పెరుగు ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదు.

Share:

కలబంద తో ఉపయోగాలు

ముదరని కలబంద ఆకుల గుజ్జుని తీసి డానికి ఉప్పు, పసుపు కలిపి 15 రోజుల పాటు ఒక్కసారి చొప్పున తీసుకుంటే .....

జీర్ణకోశంలోని సూక్ష్మక్రిములన్ని చంపేస్తుంది.

జీర్ణ శక్తిని పెంపొందిస్తుంది.

క్లోమ గ్రంధి ని శుద్ధి చేస్తుంది.

కాలేయ విధులను సక్రమం చేస్తుంది.

రక్తాన్ని శుద్ధి చేస్తుంది.

వ్యాధినిరోధక శక్తిని పెంపొందిస్తుంది



Share:

బానపొట్ట ఉందని బాధపడుతున్నారా?


పిప్పళ్ళు (లాంగ్ పెప్పర్) ను పొడి చేసి తేనెతో కలుపుకొని ఉదయం, రాత్రి భోజనం చేసిన గంట తరువాత తింటే బాన పొట్ట తగ్గుతుంది. అధిక బరువు చాన వేగంగా తగ్గుతారు.





 

పిప్పళ్ళు పొడి చేసుకొని బెల్లంతో కలిపి తింటే దగ్గు, అస్తమా తగ్గిపోతాయి. పేగుల్లో పురుగులు నశిస్తాయి.

 

పిప్పళ్ళు కషాయం తాగితే కీళ్ళ నొప్పులు తగ్గి పోతాయి, వాపులు వుండవు.

Share:

ఫలాలు, కాయగూరలలో దాగివున్న శక్తి

ప్రకృతి  నుంచి లభించే  లాభాలు

 

బిటరూట్ బిపిని క్రమబద్దికరిస్తుంది.

ఉలవలు ఊబకాయాన్ని తగ్గిస్తుంది.

క్యారెట్ నరాల బలహీనత నుండి కాపాడుతుంది.

 

ద్రాక్షలో ఉండే ఫైటో కెమికల్ కొలస్ట్రాల్ ని దరి చేర నియ్యవు.

 

వాము దంత వ్యాధులను తగ్గిస్తుంది.

ఆవాలని క్రమం తప్పకుండా తీసుకుంటే ఇన్సులిన్ వృద్ధి చెందుతుంది.





 

మునగకాయలు ఆకలిని పెంచుతాయి.

 

ప్రోస్టేట్ క్యాన్సర్ సోకకుండా అడ్డుకునే శక్తి టామాటోలో ఉంది.

 

కీరదోసకాయలో ఉండే సిలికాన్, sulphur లు శిరోజాలకు మేలు చేస్తాయి.

 

అల్లం కడుపు ఉబ్బరంను తగ్గిస్తుంది. మలబద్ధకాన్ని వదిలిస్తుంది. అల్లం తింటే ఎక్కిళ్ళు తగ్గుతాయి.

యాపిల్ తింటే నిద్ర బాగా పడుతుందని పరిశోధనలో తేలింది.

మూత్రపిండాల వ్యాధులున్న వారికి మొక్కజొన్న ఒక మంచి ఔషదం.

ఖర్జూరం ముత్ర సంబంధిత వ్యాధులను తగ్గించి, మూత్రం సాపీగా అయ్యేలా చేస్తుంది.

కరివేపాకు రక్తహీనతను తగ్గిస్తుంది.

నేరెడుపండ్లు తింటే కడుపులో పురుగులు చచ్చి పోతాయి.

జామకాయలు ఎక్కువగా  తింటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.

Share:

దాల్చిన చెక్క గురించి .....

 వాగ్భటులు చెప్పే మరో ముఖ్య వస్తువు దాల్చిన చెక్క. వాయువు ( వాతం ) యొక్క సంబంధమైన రోగాలు అస్తమా , ఉబ్బసం వాటిని నివారిస్తుంది. ఈ దాల్చిన చెక్క దగ్గు , జలుబు , స్ధూలకాయము వంటి కఫ సంబంధ వ్యాధులను కూడా నయం చేస్తుంది. కాబట్టి దాల్చిన చెక్కని కూడా ఉపయోగించుకోండి. దాల్చిన చెక్కని పౌడర్ చేసి వాడుకుంటే ఎక్కువ ఉపయోగం. ఇంకా బెల్లంతో కలిపి నూరుకుని తీసుకుంటే ఎంతో మంచిది. అలాగే తేనెతో కలిపి మర్ధనం చేసివాడుకుంటే కనీసం 50 రకాల రోగాలు నయం చేసుకోవచ్చును. 

      ఇలా మన వంటింట్లో ఎన్నో రకాల ఔషధాలు ఉన్నాయి. 


Share:

30 రోజుల్లో రక్తంలో హిమోగ్లోబిన్ పెరిగేందుకు - సిద్ద యోగం -

గోధుమగడ్డి చూర్ణం ఒకస్పూన్ ఒక గ్లాసు దానిమ్మ జ్యూస్ లో కలిపి ఉదయం సాయంత్రం ఆహారానికి గంటన్నర ముందు తీసికొనవలెను . అదేవిధంగా ఆహారం తీసుకున్న గంటన్నర తరువాత ఉదయం మరియు సాయంత్రం ఒక ఆపిల్ పండు తినవలెను . కేవలం నెలరోజుల్లో మీ రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరిగి రక్తం అద్బుతంగా వృద్ధి అగును. 



Share:

గ్యాస్ సమస్య నుండి ఉపశమనానికి ఇలా చేయండి..

జీర్ణకోశంలో ఉండే మ్యూకస్ పొరలు వాపునకు గురైనప్పుడు, పలు రకాల ఆహార పదార్థాలను తినడం వల్ల, ఒత్తిడి, ఆందోళనకు ఎక్కువగా లోనవడం వల్ల, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, మద్యం సేవించడం వంటి అనేక కారణాల వల్ల చాలా మందికి గ్యాస్, అసిడిటీ సమస్యలు వస్తుంటాయి. అయితే ఇలా వచ్చే గ్యాస్ సమస్యను పలు సింపుల్ టిప్స్ పాటించడం వల్ల సులభంగా తగ్గించుకోవచ్చు. ఆ టిప్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 





1. ఒక గ్లాస్ నీటిలో ఒక టీస్పూన్ బేకింగ్ సోడా, అర టీస్పూన్ నిమ్మరసం వేసి బాగా కలిపి ఆ మిశ్రమాన్ని తాగితే గ్యాస్ సమస్య ఉండదు. 

2. పుదీనా, చామంతి, రాస్ప్‌బెర్రీ రుచులలో ఉండే టీని తాగినా గ్యాస్ సమస్య బాధించదు. 

3. పసుపు ఆకులను ఎండబెట్టి పొడి చేసి ఆ పొడిని ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని ఒక గ్లాస్ పాలలో కలుపుకుని తాగాలి. దీంతో గ్యాస్ సమస్య ఇట్టే పోతుంది. 

4. రోజూ ఉదయాన్నే పరగడుపున‌ 6 నుంచి 8 గ్లాసుల నీటిని తాగినా గ్యాస్ సమస్య నుంచి బయట పడవచ్చు. 

5. గ్యాస్ సమస్యకు అల్లం చాలా మెరుగ్గా పనిచేస్తుంది. భోజనానికి ముందు చిన్న అల్లం ముక్కను నమిలి మింగాలి. లేదంటే 1 టీస్పూన్ అల్లం రసం తాగినా చాలు. సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. 

6. ఆలుగడ్డలను ముక్కలుగా కోసి మిక్సీలో వేసి జ్యూస్ చేయాలి. దీన్ని రోజూ భోజనానికి ముందు తాగితే గ్యాస్ సమస్య రాదు. 

7. భోజనానికి ముందు రెండు, మూడు వెల్లుల్లి రెబ్బలను నమిలి మింగాలి. లేదంటే వాటి రసం తాగినా చాలు సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. 

8. దాల్చినచెక్కను ఒక గ్లాస్ నీటిలో వేసి బాగా మరిగించి ఆ నీటిని తాగాలి. భోజనానికి ముందు ఈ నీటిని తాగితే గ్యాస్ రాదు. 

9. భోజనం చేశాక 2, 3 యాలకుల్ని అలాగే నమిలి తిన్నా గ్యాస్ రాదు. 

10. రోజూ ఏదో ఒక సమయంలో కొబ్బరినీళ్లను తాగుతుంటే గ్యాస్ రాకుండా ఉంటుంది. 

11. ఒక గ్లాస్ వేడి నీటిలో 3 టీస్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్‌ను వేసుకుని తాగాలి. దీంతో గ్యాస్ సమస్య పోతుంది. 

12. రోజూ మజ్జిగలో నల్ల ఉప్పు (బ్లాక్ సాల్ట్) కలుపుకుని తాగినా గ్యాస్ సమస్య బాధించదు. 

13. కొద్దిగా కొత్తిమీర తీసుకుని దాన్నుంచి రసం తీసి ఆ రసం తాగాలి. దీంతో గ్యాస్ సమస్య పోతుంది. కొత్తిమీరను నేరుగా తిన్నా సరే ఈ సమస్య రాదు. 

14. రోజూ రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో నల్ల మిరియాల పొడి వేసుకుని కలిపి తాగుతుంటే ఫలితం ఉంటుంది. 

15. ఒక గ్లాస్ వేడి నీటిలో ఒక టీస్పూన్ ఇంగువను వేసి కలిపి తాగితే గ్యాస్ బారి నుంచి బయట పడవచ్చు. 

16. భోజనం చేశాక సోంపు, లవంగాలు, వాము నమిలి మింగాలి. దీని వల్ల కూడా గ్యాస్ సమస్యను అధిగమించవచ్చు. 

17. రోజూ వేడి నీటిని తాగడం అలవాటు చేసుకుంటే గ్యాస్ సమస్య రాదు. తిన్న ఆహారం జీర్ణం సరిగ్గా అవుతుంది.
Share:

రక్తంలో ప్లేట్ లెట్స్ ను అభివృద్ధి చేసే 9 ఉత్తమ ఆహారాలు..!

సాధారణంగా మన రక్తంలో 1,50,000 నుండి 4,50,000 ల ప్లేట్లెట్స్ ఉంటాయి, ఇవి మనకి ఏదైనా గాయం వల్ల రక్తం బయటకి వచ్చినప్పుడు ఆ రక్తాన్ని గడ్డకట్టేలా మరియు గాయం తొందరగా తగ్గిపోయేలా పని చేస్తాయి, ప్లేట్లెట్స్ మన శరీరంలో రక్తానికి సంభందించిన అన్ని రిపేర్లని సమర్థవంతంగా చేస్తాయి, ఒకవేళ ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోతే మనిషి ప్రాణాలకే ప్రమాదం, ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోయినప్పుడు తీవ్రంగా జ్వరం, బిపి, హార్ట్ అటాక్, పూర్తి నీరసం వచ్చే ప్రమాదం ఉంటుంది, ఎప్పటికప్పుడు ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోకుండా చూసుకోవాలి, మనం బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే మన రక్తంలో ఎన్ని ప్లేట్లెట్స్ ఉన్నాయో తెలుస్తుంది. మనం తినే ఆహరం పైనే ప్లేట్లెట్స్ సంఖ్య ఆధారపడి ఉంటుంది, ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోకుండా ఉండాలంటే కింద సూచించిన వాటిని ఎక్కువగా తినండి.





రక్తంలో ప్లేట్ లెట్స్ ను అభివృద్ధి చేసే 9 ఉత్తమ ఆహారాలు

1. బీట్ రూట్ :::: ప్లేట్ లెట్స్ ను పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. అనీమియాతో బాధపడే వారు తప్పకుండా బీట్స్ తీసుకోవాలి.

2. క్యారెట్ :::: క్యారెట్ వంటి దుంపలు వారంలో కనీసం రెండు సార్లైనా తినాల్సి ఉంటుంది .

3. బొప్పాయి :::: బ్లడ్ లెవల్ తక్కువగా ఉన్నప్పుడు వెంటనే బొప్పాయి తీసుకోవడం మంచిది.

4. వెల్లుల్లి :::: శరీరంలో నేచురల్ గా ప్లేట్ లెట్స్ పెంచుకోవాలంటే, వెల్లుల్లిని తినాలి. ఇది ఒక ఐడియల్ పదార్థం కాబట్టి, మీరు తయారుచేసే వంటల్లో వెల్లుల్లి జోడించుకోవచ్చు.

5. ఆకుకూరలు :::: శరీరంలో ప్లేట్ లెట్స్ తక్కువగా ఉన్నప్పుడు, విటమిన్ కె పుష్కలంగా ఉన్న ఆకుకూరలు తీసుకోవడం మంచిది.

6. దానిమ్మ :::: ఎర్రగా ఉండే అన్ని రకాల పండ్లలోనూ ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది ప్లేట్లెట్ కౌంట్ ను పెంచడానికి బాగా సహాయపడుతాయి.

7. ఆప్రికాట్ :::: ఐరన్ అధికంగా ఉన్నపండ్లో మరొకటి ఆప్రికాట్ . రోజుకు రెండు సార్లు ఆప్రికాట్ ను తినడం వల్ల ప్లేట్లెట్ లెవల్స్ పెంచుకోవచ్చు.

8.ఎండు ద్రాక్ష :::: రుచికరమైన డ్రై ఫ్రూట్స్ లో 30శాతం ఐరన్ ఉంటుంది. ఒక గుప్పెడు ద్రాక్ష తినడం వల్ల ప్లేట్లెట్ లెవల్స్ ను నేచురల్ గా పెంచుతుంది.

9.ఖర్జూరం :::: ఎండు ఖర్జూరంలో కూడా ఐరన్ మరియు ఇతర న్యూట్రీషియన్స్అధికంగా ఉంటాయి కాబట్టి, నేచురల్ గా ప్లేట్లెట్స్ మెరుగుపరచడానికి సహాయపడుతాయి.
Share:

అత్తిపత్తి ఆకులు ముట్టుకుంటే ఎందుకు ముడుచుకుంటాయి?

అత్తిపత్తి:- అత్తిపత్తి లేదా సిగ్గాకు (ఆంగ్లం Touch-me-not) ముట్టుకుంటే ముడుచుకునే లక్షణం గల ప్రాకే మొక్క. సంస్కృతంలో నిద్రభంగి, లజ్జాకు అని, హిందీలో లాంజోతి, చుయిముయి, షర్మాని అని, తమిళంలో తోట్టసినింగి, నిన్నసినింగి, అని తెలుగులో నిద్రగన్నిక, నిసిగ్గుచితక అని, లాటిన్ లో Neptuniao Leracea & Mimosa Pidica (Sensitive Plant) అని అంటారు ఇది ఫాబేసి కుటుంబానికి చెందినది. దీని శాస్త్రీయనామం మైమోసా ప్యూడికా (లాటిన్లో ప్యూడికా అంటే సిగ్గు అని అర్ధం). ఈ మొక్కను కేవలం దాని విలక్షణతకై పెంచుకుంటుంటారు. అత్తిపత్తి ఆకులు ముట్టుకున్న వెంటనే లోపలివైపుకు ముడుచుకొని వాలిపోతాయి. మళ్లీ కొన్ని నిమిషాల్లో తిరిగి యధాస్థితికి చేరతాయి. దక్షిణ అమెరికా మరియు మధ్య అమెరికా ప్రాంతాలకు స్థానికమైన ఈ మొక్క, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సమశీతోష్ణ ప్రాంతాలన్నింటిలో కలుపుమొక్కగా పెరుగుతుంది.

అత్తిపత్తి ఆకులు మన చేతితో తాకినా, ఏదైనా కీటకం వాలిగా, నీటిచుక్కలు పడినా, పెద్దగా గాలి వీచినా వెంటనే ముడుచుకొనిపోతాయి. అయితే యధాస్థితికి రావడానికి అరగంట నుండి గంట వరకు పడుతుంది. దీనికి కారణం ఆకులు కొమ్మను కలిసే ప్రదేశంలో మందంగా బుడిపెలా ఉండే పత్రపీఠం. మనం ఆకుల్ని తాకినప్పుడు దీనిలోని మృదుకణజాలం నుండి నీరు కాండంలోనికి వెళ్ళి ఫలితంగా పటుత్వం తగ్గిపోయి ఆకులు వాలిపోతాయి. కొంత సమయానికి కాండం నుండి నీరు బుడిపెలోనికి చేరి ఆకులు తిరిగి యధాస్థితికి వస్తాయి.




దీనిలో కొన్ని ప్రత్యేక నిర్మాణాలు ఉన్నాయి. ఆకుల కింద ద్రవంతో నిండిన సంచులుంటాయి. ఆ సంచులలో ద్రవం ఉన్నంత వరకు ఆకులు విచ్చుకొని వుంటాయి. ఎప్పుడైతే ఆకులపై ఉన్న స్పర్శ గ్రాహకాలు స్మర్శని గ్రహిస్తాయో అవి వెంటనే ఆ సంకేతాలను సంచులకు పంపుతాయి. అప్పుడు సంచులలో నుండి ద్రవం బయటకు (మొక్క కొమ్మలోపలికి) వెళ్లి పోతుంది. దాంతో ఆకులు ముడుచుకు పోతాయి. మరల కొద్దిసేపటికి సంచులలో ద్రవం నిండి ఆకులు విచ్చుకొంటాయి. ఇది ఒక రక్షణ పద్ధతి. పశువులు, జంతువులు ఆకులను తాకగానే ముడుచుకోవటం వలన మొక్క ఎండిపోయినట్లు కనిపిస్తుంది. దీని వల్ల జంతువులు తినకుండా వెళ్లిపోతాయి. మరికొన్ని మొక్కలు రాత్రిళ్ళు వాటంతట అవే ఆకుల్ని ముడుచుకుంటాయి.

అత్తిపత్తి ఉపయోగాలు:-

ఈ మొక్కలో వుండే రసాయనం మైమోసిన్ (ఆల్కలాయిడ్).

రక్త శుద్ధి చేస్తుంది.
ముక్కు నుండి కారే రక్తాన్ని ఆపుతుంది
స్త్రీరోగాలను హరించి వేస్తుంది.ఋతురక్తాన్ని, మూత్రాన్ని సాఫీగా జారీచేస్తుంది,
ఇది వాతాన్ని హరిస్తుంది.
పాత వ్రణాలనుమాన్పుతుంది.
మధుమేహ రోగాల్ని, ములవ్యాధిని, బోధకాలును, కామేర్లను, పోడలను కుష్టును, విరేచనాలను, జ్వరమును, గుండెదడను, శ్వాసకాసాలను, తుంటి నొప్పిని, ఉబ్బరోగం వంటి వాటిని తగ్గిస్తుంది.
అత్తి పత్తి - గుణ ప్రభావాలు : ఇది వాతాన్ని హరిస్తుంది, రక్త శుద్ధిచేస్తుంది, ఋతురక్తాన్ని, మూత్రాన్ని సాఫీగా జారీ చేస్తుంది. ముక్కునుండి కారే రక్తాన్ని ఆపుతుంది. పాత వ్రణాలను మాన్పుతుంది..మేహ రోగాలను, మూల వ్యాధిని, బోదకాలును, కామెర్లను, పొడలను, కుష్ఠును, విరెచనాలను, జ్వరమును, గుండెదడను, శ్వాసకాలను, తుంటినొప్పిని, ఉబ్బురోగాన్ని, స్త్రీరోగాలౌ హరించి వేస్తుంది.

వీర్యహీనతకు - బ్రహ్మాస్త్రం : అత్తపత్తి గింజలు, చింతగింజలపప్పు, నీరుగొబ్బిగింజలు సమంగా తీసుకొని మఱ్ఱిపాలలో ఒకరాత్రి నానపెట్టి తరువాత గాలికి ఆరపెట్టి మెత్తగానూరి శనగ గింజలంత మాత్రలుచేసి గాలికి ఎండపెట్టి నిలువ చేయాలి. రెందు పూటలా పూటకు మూడు మాత్రలు నీటితో వేసుకొని వెంటనే నాటుఆవుపాలు కండచక్కెర కలిపి తాగాలి. నలభై రోజుల్లో వీర్యము పోవడం, శిఘ్రస్కలనం, నపుంసకత్వం, అంగబలహీనత హరించి ధాతుపుష్టి కలుగుతుంది. వేడి, పులుపు, కారం పదార్థాలు నిషేధించి బ్రహ్మచర్యం పాటించాలి.
Share:

బృహతీ పత్ర ఉపయోగాలు

ఈ పత్రితో ఉన్న ఇతర ఉపయోగాలు :

1.ఇది కంఠరోగాలను, శరీర నొప్పులను నయం చేస్తుంది
2.ఈ ప‌త్రాలు లేదా కాయలు శ్వాస‌కోశ వ్యాధుల‌కు విరుగుడుగా ప‌ని చే్స్తాయి.
3.గుండె పనితీరును మెరుగుపరుస్తుంది.




ఈ పత్రి ఉల్లేఖన ఆయుర్వేదంలో ఉంది. ఇది దీనిని నీళ్ళలో కాచి, ఆకులను ఉప్పుతో కలిపి నూరి ఒక గుడ్డలో తీసుకొని కీళ్ళనొప్పులు ఉన్న చోట కట్టుకడితే.. ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా వేడి గడ్డలపెై ఈ మిశ్రమాన్ని కట్టుకడితే.. త్వరగా తగ్గిపోతాయి, దగ్గు, ఉబ్బసం వంటివి తగ్గుముఖం పడతాయి. హృదయానికి చాలా మంచిది. వీర్యవృద్ధిని కలుగజేస్తుంది. మూత్రం సాఫీగా కావడానికి, తాప నివారణకు, హృద్రోగ శాంతికి నేల మునగాకు సహకరిస్తుంది, రోగాల నివారణకు ఉపయోగపడుతుంది.
Share:

పచ్చి ఉల్లిని ఇలా వాడండి షుగర్ ఎంత ఉన్నా దెబ్బకు కంట్రోల్ అవుతుంది!!

అవును ఒకే ఒక ఉల్లిపాయతో షుగర్ పని పట్టొచ్చు. ఇది సంప్రదాయక ఆయుర్వేద వైద్యం చెబుతోంది. ఇటీవలి కాలంలో ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్న షుగర్ వ్యాధికి చక్కటి పరిష్కారాలు చూపిస్తోంది. హల్లో పతి మందులకు లొంగని హై షుగర్ సైతం 50 గ్రాముల ఉల్లిపాయతో దెబ్బకు దిగివస్తుందని పేర్కొంటోంది. చేయాల్సిందల్లా కింద చెప్పిన విధంగా ఉల్లిపాయను క్రమం తప్పకుండా తింటూ ఉండడమే.. ఇలా 7 రోజులు చేస్తే అద్భుత మైన ఫలితాలు అనుభవ పూర్వకంగా తెలుస్తాయని భరోసా ఇస్తోంది. పాశ్చాత్య అలవాట్ల కారణంగా సోకిన షుగర్ వ్యాధికి మన వంటింటి వైద్యం చెప్పే చక్కని పరిష్కారాన్ని తెలుసుకోండి. మీరు ఆచరించడంతో పాటుగా నలుగురికి తెలిసేలా షేర్ చేయండి..




ఇలా చేయాలి:
రోజుకి 50 గ్రాముల పచ్చి ఉల్లి పాయలను ఖచ్చితంగా తినాలి.
ఉదయం పచ్చిది తిన్నా సరే, అన్నంలో కలుపుకుని తిన్నా సరే.. పచ్చిది మాత్రం తినాలి.
50 గ్రాముల పచ్చి ఉల్లిపాయ 20 యూనిట్ల ఇన్సులిన్ తో సమానం.
7 రోజులు క్రమం తప్పకుండా తింటే చాలు ఫుల్ హై లో ఉన్న షుగర్ కంట్రోల్ లోకి వస్తుంది.
50 గ్రాములు ఒకేసారి తినలేకపోతే ఉదయం కొద్దిగా, మధ్యాహ్నం కొద్దిగా, సాయంత్రం కొద్దిగా తింటూ ఉండాలి.
పచ్చి ఉల్లిపాయతో పచ్చిపులుసు చేసుకుని అన్నంతోపాటు తిన్నా సరిపోతుంది.
పచ్చి ఉల్లిపాయతో ఇతర ప్రయోజనాలు:
ఉల్లిపాయను సన్నని ముక్కలుగా కట్ చేసి ఆ ముక్కలను నీటిలో వేసి మరిగించి తాగుతుంటే మూత్రంలో మంట తగ్గిపోతుంది.
ఉల్లిపాయలను గుజ్జుగా దంచి 3 టేబుల్ స్పూన్ల వెనిగర్కు కలిపి తింటూ ఉంటే జీర్ణాశయ సంబంధ సమస్యలు తగ్గిపోయి ఆ వ్యవస్థలు పటిష్టమవుతాయి.
ఉల్లిపాయను గుజ్జుగా దంచి దానికి చిటికెడు నల్ల ఉప్పు పొడిని కలిపి రోజూ 2, 3 సార్లు తింటూ ఉంటే నీళ్ల విరేచనాలు, వాంతులు అదుపులోకి వస్తాయి.
పచ్చి ఉల్లిపాయలను నిత్యం ఏదో ఒక రూపంలో తింటూ ఉంటే మహిళల్లో వచ్చే రుతుక్రమ సమస్య తగ్గిపోతుంది.
పచ్చి ఉల్లిపాయలను తినడం వల్ల బీపీ, గుండెపోటు, ఆస్తమా, అలర్జీలు, ఇన్ఫెక్షన్లు, దగ్గు, జలుబు, నిద్రలేమి, స్థూలకాయం వంటి సమస్యలను రావు.
కాలిన గాయాలపై పచ్చి ఉల్లిపాయను మర్దనా చేయాలి. దీంతో ఆ ప్రదేశంలో ఏర్పడే మంట, నొప్పి తగ్గిపోతాయి. అంతేకాదు ఇన్ఫెక్షన్లు కూడా రావు.
Share:

రుచి ఉన్న జాజికాయ వివిధ రకాల ఔషధ గుణాలు

 రుచి ఉన్న జాజికాయ వివిధ రకాల ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. జాజికాయను వాడితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.



జాజికాయ మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. పురుషుల్లో కామవాంఛను పెంచుతుంది. వీర్యకణాల ఉత్పత్తి పెరిగేందుకు దోహదపడుతుంది. జాజికాయను కొద్దిపాటి మంటమీద నేతిలో వేయించి పొడి చేసి ఉంచుకోవాలి. ఈ చూర్ణాన్ని ఐదు గ్రాముల మోతాదుగా ఉదయం, సాయంత్రం గోరువెచ్చని ఆవుపాలతో కలిపి తాగినట్లయితే చక్కటి ఆరోగ్య ఫలితాలు మీ సొంతం. నపుంశకత్వాన్ని తరిమికొడుతుంది. నరాల బలహీనతను పోగొడుతుంది. ఆరోగ్యమే కాదు అందాన్ని కూడా పెంచడంలో ఉపయోగపడుతుంది.

కొంచెం జాజికాయ పొడిని తీసుకుని దానికి నీళ్ళు లేదా తేనె కలిపి ఫేస్ ప్యాక్‌లా తయారుచేసుకోవాలి. దీన్ని ముఖానికి స్క్రబ్ లా రాసుకోవాలి. ఇలా చేస్తే కొన్నిరోజులకు చర్మం కాంతి వంతమవడంతో పాటు మచ్చలు, మొటిమలు పోయాయి.
Share:

ఆహారంలో నిషేదించాల్సింది ( avoid )చేయాల్సినవి.....

విలైనంత వరకు గుర్తుంచుకొని ఇవన్నీ ఆహారములో నిషేదిన్చాల్సినవట ....

1. తేనే (honey) మరియు నెయ్యి (gee) కలిపి తినకూడదు. ఆ రెండిటి కలయిక విషపూరితం అయినది. Don't mix honey and ghee it is poisonous.

2. పెరుగు (curd) లేక చల్ల ను (butter milk) అరటి పండు తో కలిపి తినకూడదు. Done eat banana with curd or buttermilk.

3. అన్నాన్ని (rice) పండ్లతో (fruits) కలిపి తినకూడదు. అలా తినడం వల్ల పండ్లలోని minerals తగ్గిపోతాయి. Don't eat fruits with rice u loose minerals.

4. కూరగాయలతో (vegetables) కలిపి వెన్నె (cheese) కలిపి తినడం వల్ల ఆరోగ్యానికి హానికరం. Don't eat cheese with vegetables. If so it is dangerous.





5. చేపల కూర (fish curry) తిన్నవెంటనే పాలు (milk) కానీ, పెరుగు (curd) కానీ తినకూడదు. అలా తింటే కుష్టి రోగం వచ్చే ప్రమాదాలు ఉన్నాయి. Don't drink milk or curd after fish curry if so u will get leporsy.

6. లావుగా ఉన్నవారు బియ్యం (rice) తో వండివి కాకుండా గోధుములతో (wheat) ఆహార పదార్ధాలు తీసుకోవడం మంచిది.. 
Fat people instead of rice they should have wheat products.

7. ఆస్తమా (asthma) రోగులు టమోటా (tomato), గుమ్మడికాయ (pumpkin), ముల్లంగి (radish) వారు తీసుకొనే ఆహారంలో వాడకూడదు. అలాగే వారు తల మీద ఎక్కువ తేమను కూడా ఉంచుకోవడం మంచిది కాదుasthma people shouldn't suppose to eat tomato, radish , pumpkin and their hair should not be wet.

8. మొలలు (piles) ఉన్నవారు గుడ్లు (eggs), మాంసం (meat) తినకూడదు. Piles people - don't eat eggs, meat.

9. నెయ్యిని రాగి (copper) పాత్రలో ఉంచి తినకూడదు. Don't use ghee if it is in copper vessel.

10. పొద్దునే bed coffee తాగటం ఆరోగ్యానికి మంచిది కాదు. పొద్దునే మంచి నీరు తాగిన తరువాత త్రాగవచ్చు . Early in the morning bed coffee is not good instead drink water.

11. అల్సర్ (ulcer) వ్యాదితో భాద పడుతున్నవారు కారాన్ని తినకూడదు. Ulcer people don't eat spicy food.

13. చర్మ వ్యాధులు (skin diseases) ఉన్నవారు పొట్ల కాయ (snake guard), పల్లీలు (pea nuts), ఎండు చేపలు (dry fish), చిక్కుడు కాయలు (Broad beans) తినకూడదు. Skin diseases people- don't eat snake guard, pea nuts, dry fish, broad beans.

14. నువ్వుల నునేతో (sesame oil) తో గోధుమ wheat కి చెందినవి చెయ్యకూడదు. Don't use Wheat and sea same oil together.

15. మోకాళ్ళ నొప్పులతో (arthritis) ఉన్నవారు మాంసం (meat), గుడ్లు( eggs) తో చేసిన వంటలు తినకూడదు. Arthritis people don't eat meat and eggs.
వీలైనంత వరకు గుర్తుంచుకొని పాటించండి.. ఆరోగ్యం బాగా చూసుకోండి. ఆరోగ్యమే మహా భాగ్యం కదా!!
Share:

ఔషధ విలువలు సమృద్ధిగా ఉన్న తులసి

ఔషధ విలువలు సమృద్ధిగా ఉన్న తులసి వల్ల లాభాలు ఎన్నో ఉన్నాయని ఆయుర్వేదం చెబుతోంది.కాచిచలార్చిన నీళ్లలో తులసి రసాన్ని కలుపుకొని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగితే మెదడు చురుకుగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు జీర్ణక్రియ మెరుగుపడుతుందని సూచిస్తున్నారు. తులసి రసంలో తేనె కలుపుకొని తాగితే కిడ్నీలో ఉండే రాళ్లు కరిగిపోతాయని అంటున్నారు. అల్లంరసంతో తులసి రసాన్ని కలిపి తాగితే కడుపునొప్పి తగ్గుతుందంటున్నారు.పొట్టలో నులిపురుగులు నశిస్తాయని, జలుబు చేసినప్పుడు తేనెలో ఒక టేబుల్‌ స్పూన్‌ తులసి రసం కలుపుకొని తాగితే ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు.



 బెల్లంతో తులసి ఆకులు కలిపి తింటే కామెర్లు తగ్గు ముఖం పడతాయని నిపుణులు వాపోతున్నారు. అంతేకాకుండా తులసీ ఆకులు జ్వరాన్ని తగ్గిస్తుంది.అల్సర్‌ల నుండి రక్షిస్తుంది. రక్తంలో షుగర్‌ లెవల్స్‌ పెరగకుండా నియంత్రిస్తుంది. కాలేయం శక్తివంతంగా పనిచేయడానికి దోహదపడుతుంది. నోటినుండి దుర్వాసన వెలువడకుండా నిషేధిస్తుంది.
అలర్జీల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఎండవల్ల సోకే అలర్జీలు, పొగ, దుమ్ము నుండి శరీరానికి కలిగే హానిని అరికడుతుంది. ఒత్తిడిని దూరం చేస్తుంది. దాదాపు అందరి ఇళ్లలోనూ ప్రధాన ద్వారానికి ఎదు రుగా లేదంటే పెరట్లో తులసి మొక్క ఉంటుంది. ఎందుకంటే తులసి ఆకుల నుంచి వచ్చే సువాసన ఇల్లంతా పరుచుకొని మంచి యాంటీసెప్టిక్‌గా పనిచేస్తూ వ్యాధులు రాకుండా చేస్తుందని విశ్వసిస్తారు. తులసి ఆకులను చప్పరించడం వల్ల దానిలో ఉండే ఔషధ గుణాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. తులసి ఆకులో ఉండే రసం ఇన్‌ఫెక్షన్లు రాకుండా చేస్తుంది. అందుకే చాలా దేవాలయాలలో తీర్ధంలో తలసీ దళాలను వేసిస్తారు.
Share:

నల్లేరు మహౌషధి

వజ్రవల్లీ, చతుర్థార, అస్థి సంధాన అని సంస్కృతంలో పేరు హిందీలో 'హడ్ జోడ్'గా పిలువబడే నల్లేరు, విరిగిన ఎముకలు చాలా త్వరితంగా అతుక్కోవడానికి ఉపకరించే ప్రాచీన మహౌషధి. దీనిని భావమిశ్రుడు తన 'భవప్రకాశ' గ్రంథంలో వివరించారు.
'సిసస్ క్వాడ్రాంగులా' లాటిన్ నామధేయముగల నల్లేరును, గ్రామీణంలో వడియాలు, పచ్చళ్లు చేసుకొని ఆహార పదార్థంగా వినియోగించుకుంటారు. దీనిలో విటమిన్‌'సి', కెరోటిన్ ఎ, స్టెరాయిడల్ ధాతువు, కాల్షియం అధిక మొత్తంలో వున్నాయని పరిశోధకులు గుర్తించారు.
కార్టిజోన్ దుష్ఫలితాలను నిలువరించి దాని యాంటీ ఎనబాలిక్ గుణాన్ని సాంద్రతను తగ్గించి, ఎనబాలిక్ ఓషధంగా పరిగణించే 'డ్యూరాబొలిన్'కంటె ఉత్తమ గుణం ఈ 'నల్లేరు'లో వున్నాయని
పరిశోధకులు ధృవీకరించారు. అస్థి ధాతువు వేగంగా ప్రవృద్ధమయేందుకు నల్లేరు విశేషంగా దోహదం చేస్తుంది. విరిగిన ఎముకలు అతుక్కోడానికి అవసరమయే 'మ్యూకోపాలిసాక్రైడ్స్' దీనిలో విశేషంగా వున్నాయి. ఇవి రక్తము ద్వారా కణజాలములో కలిసి వృద్ధి చెందడానికి దోహదం చేస్తుంది.



నల్లేరు:-నల్లేరు యొక్క సాంకేతిక నామం CISSUS QUADRA GULARIS లేక VITUS QUADRANGU LARIS. ఆంగ్లములో DEVILS BACK BONE అంటారు. దక్షిణ భారతంలో మరియు శ్రీలంకలో ఎక్కువగా లభ్యమవుతుంది.

విరిగిన ఎముకలు అతుక్కోవడంలో అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి అస్థిసంహార అని కూడా పిలుస్తారు. ఇది సాధారణంగా 1.5 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. దీని కాండం చతురస్రాకారంలో వుంది. 8-10 సెంటీమీటర్ల దగ్గర 'గణుపు' వుంటుంది. ఆ గణుపు దగ్గర వేరు లేక తీగల వంటి CLIMBING ROOTS వస్తాయి. ఆకులు కూడా ఆ గణుపు దగ్గరే వస్తాయి. దీని కాండం ఓషధ ప్రయోగానికి ఉపయోగిస్తుంది. తుంచితే జిగురు వస్తుంది. హిందీలో 'హడ్‌జోడ్'గా పిలుస్తారు.
దీనిలో ఎక్కువ శాతం కెరోటినాయిడ్స్, కాల్షియం, విటమిన్ సి, కాల్షియమ్ ఆక్సలేటర్ వంటి రసాయనాలు లభ్యమవుతాయి. ఈ ఓషధి ఘనసత్వం ఊబకాయం తగ్గించడంలో, ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గించడంలో బాగా ఉపయోగిస్తుంది. కొన్ని సందర్భాలలో ఊహించని విధంగా అనుకోకుండా మేలును చేకూర్చే వస్తు సముదాయం మన పక్కనే వుందని గమనించకుండా వుండి ఎవరో చెబితే 'మహౌషధి' అది ఇతరులు చెప్పినపుడు ఆశ్చర్యమవుతుంది. అటువంటి మహౌషధి నల్లేరు.
Share:

నల్లేరు మహౌషధి

వజ్రవల్లీ, చతుర్థార, అస్థి సంధాన అని సంస్కృతంలో పేరు. హిందీలో 'హడ్ జోడ్'గా పిలువబడే నల్లేరు, విరిగిన ఎముకలు చాలా త్వరితంగా అతుక్కోవడానికి ఉపకరించే ప్రాచీన మహౌషధి. దీనిని భావమిశ్రుడు తన 'భవప్రకాశ' గ్రంథంలో వివరించారు.
'సిసస్ క్వాడ్రాంగులా' లాటిన్ నామధేయముగల నల్లేరును, గ్రామీణంలో వడియాలు, పచ్చళ్లు చేసుకొని ఆహార పదార్థంగా వినియోగించుకుంటారు. దీనిలో విటమిన్‌'సి', కెరోటిన్ ఎ, స్టెరాయిడల్ ధాతువు, కాల్షియం అధిక మొత్తంలో వున్నాయని పరిశోధకులు గుర్తించారు.
కార్టిజోన్ దుష్ఫలితాలను నిలువరించి దాని యాంటీ ఎనబాలిక్ గుణాన్ని సాంద్రతను తగ్గించి, ఎనబాలిక్ ఓషధంగా పరిగణించే 'డ్యూరాబొలిన్'కంటె ఉత్తమ గుణం ఈ 'నల్లేరు'లో వున్నాయని
పరిశోధకులు ధృవీకరించారు. అస్థి ధాతువు వేగంగా ప్రవృద్ధమయేందుకు నల్లేరు విశేషంగా దోహదం చేస్తుంది. విరిగిన ఎముకలు అతుక్కోడానికి అవసరమయే 'మ్యూకోపాలిసాక్రైడ్స్' దీనిలో విశేషంగా వున్నాయి. ఇవి రక్తము ద్వారా కణజాలములో కలిసి వృద్ధి చెందడానికి దోహదం చేస్తుంది.



నల్లేరు:-నల్లేరు యొక్క సాంకేతిక నామం CISSUS QUADRA GULARIS లేక VITUS QUADRANGU LARIS. ఆంగ్లములో DEVILS BACK BONE అంటారు. దక్షిణ భారతంలో మరియు శ్రీలంకలో ఎక్కువగా లభ్యమవుతుంది.

విరిగిన ఎముకలు అతుక్కోవడంలో అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి అస్థిసంహార అని కూడా పిలుస్తారు. ఇది సాధారణంగా 1.5 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. దీని కాండం చతురస్రాకారంలో వుంది. 8-10 సెంటీమీటర్ల దగ్గర 'గణుపు' వుంటుంది. ఆ గణుపు దగ్గర వేరు లేక తీగల వంటి CLIMBING ROOTS వస్తాయి. ఆకులు కూడా ఆ గణుపు దగ్గరే వస్తాయి. దీని కాండం ఓషధ ప్రయోగానికి ఉపయోగిస్తుంది. తుంచితే జిగురు వస్తుంది. హిందీలో 'హడ్‌జోడ్'గా పిలుస్తారు.
దీనిలో ఎక్కువ శాతం కెరోటినాయిడ్స్, కాల్షియం, విటమిన్ సి, కాల్షియమ్ ఆక్సలేటర్ వంటి రసాయనాలు లభ్యమవుతాయి. ఈ ఓషధి ఘనసత్వం ఊబకాయం తగ్గించడంలో, ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గించడంలో బాగా ఉపయోగిస్తుంది. కొన్ని సందర్భాలలో ఊహించని విధంగా అనుకోకుండా మేలును చేకూర్చే వస్తు సముదాయం మన పక్కనే వుందని గమనించకుండా వుండి ఎవరో చెబితే 'మహౌషధి' అది ఇతరులు చెప్పినపుడు ఆశ్చర్యమవుతుంది. అటువంటి మహౌషధి నల్లేరు.
Share:

రాజీవ్ దీక్షిత్ స్వదేశి చికిత్స - కొన్ని నియమాలు ... సంపూర్ణ ఆరోగ్యం

ఈ కొన్ని నియమాలను పాటించండి .ఆరోగ్యాన్ని పొందండి .

1. ఉదయం నిద్ర లేచిన తర్వాత ఎటువంటి నీళ్ళు త్రాగవలెను?
     గోరు వెచ్చని . 
2. నీళ్ళు ఎలా త్రాగాలి ?
          సుఖాసనంలో కూర్చొని , గుటక గుటకగా త్రాగాలి . 
3. తినే ఆహారాన్ని ఎన్ని సార్లు నమలాలి ?
     32 సార్లు . 
4. కడుపు నిండా ఆహారం ఎప్పుడు తినాలి ?
   ఉదయం . 



5 . ఉదయం బ్రేక్ ఫాష్ట్ ఎపుడు చేయాలి ?
   సూర్యోదయం అయిన 1 1/2 గంటలోపు తినాలి . 
6  ఉదయం బ్రేక్ ఫాష్ట్ లేక భోజనం తర్వాత ఏమి త్రాగ వచ్చు ? 
      పండ్ల రసాలు . 
7 మధ్యాహ్న భోజనం తర్వాత ఏమి త్రాగవచ్చు ?
   లస్సి / మజ్జిగ .
8 రాత్రి భోజనం తర్వాత ఏమి త్రాగాలి? 
     పాలు .
9  పండ్లు ఏ సమయంలో తినరాదు ? 
      రాత్రి .
10  ఐస్ క్రీమ్ ఎప్పుడు తిన వచ్చు ?
    తినరాదు . 
11 ఫ్రిజ్ లో వుంచి , బయటకు తీసిన పదార్ధాలు ఎంత సేపటి తర్వాత తినాలి? 
   1 గంట తర్వాత .
12 COOL DRINKS త్రాగ వచ్చా ?
  త్రాగరాదు . 
13  వండిన ఆహారం ఎంత సేపటిలో తినాలి ?
   40 నిమిషాలలోపు . 
14  రాత్రి భోజనం ఎంత తినాలి ?
   మధ్యాహ్నం తిన్న భోజనం కంటే తక్కువ తినాలి . 
15 రాత్రి భోజనం ఎప్పుడు చెయ్యాలి ? 
 సూర్యాస్తమయం లోపల .
16  బ్రేక్ పాష్ట్ , భోజనానికి ముందు నీళ్ళు ఎప్పుడు త్రాగవచ్చు? 
  48 నిమిషాల ముందు . 
17 రాత్రి లస్సీ త్రాగవచ్చా ?
   త్రాగరాదు . 
18. ఉదయం భోజనం తర్వాత ఏమి చెయ్యాలి ?
  పని చెయ్యాలి . 
19 మధ్యాహ్న భోజనం తర్వాత ఏమి చెయ్యాలి ?
  విశ్రాంతి తీసుకోవాలి . 
20 రాత్రి భోజనం తర్వాత ఏమి చెయ్యాలి ?
  500 అడుగులు నడవాలి . 
21 ఎల్లప్పుడు భోజనం చేసిన తర్వాత ఏమి చెయ్యాలి ?
 5 --10 నిమిషాలు వజ్రాసనం వెయ్యాలి .
22 ఉదయం లేచిన తర్వాత కండ్లకు ఏమి పూయాలి ?
  లాలా జలం . 
23 రాత్రి ఎన్ని గంటలకు పడు కోవాలి ?
   9 -- 10 గంటలలోపు . 
24 3  విషాలు ఏవి ?
    చెక్కర , మైదా , తెల్ల ఉప్పు . 
25 మధ్యాహ్న భోజనంలో ఏమి వేసుకొని తినాలి ? 
  వాము .
26  రాత్రి  SALAD తిన వచ్చా ? 
  తినరాదు . 
27  ఎల్లప్పుడు భోజనం ఎలా చెయ్యాలి ?
  సుఖాసనంలో కూర్ఛొని , నమిలి , నమిలి తినాలి . 
28  టీ ( tea ) త్రాగ వచ్చా ?
   త్రాగ రాదు . 
29 పాలలో ఏమి వేసుకొని త్రాగాలి ? 
  పసుపు .
30 పాలలో పసుపు వేసుకొని ఎందుకు త్రాగాలి ? 
  క్యాన్సర్ రాకుండా . 
31 ఏ చికిత్సలు మంచివి ?
   ఆయుర్వేధం . 
32 బంగారు పాత్రలోని నీళ్ళు ఎప్పుడు త్రాగాలి ? 
   October ... March.
33 రాగి పాత్రలోని నీళ్ళు ఎప్పుడు త్రాగాలి ?
    June ... September. 
34 మట్టి పాత్రలోని నీళ్ళు ఎప్పుడు త్రాగాలి ? 
   March .... June. 
35 ఉదయం నీళ్ళు ఎంత త్రాగాలి ? 
  కనీసం  2 లేక 3 గ్లాసులు . 
36 ఉదయం ఎప్పుడు లేవాలి ?  సూర్యోదయానికి  1 1/2 గంట ముందు. 
Share:

జిల్లేడు లేదా అర్క ( Calotropis )

జిల్లేడు:  జిల్లేడు లేదా అర్క (లాటిన్ Calotropis) ఒక పాలుగల చిన్న మందు మొక్క. జిల్లేడులో మూడు జాతులు గలవు. 1. తెల్లజిల్లేడు, 2. ఎర్రజిల్లేడు, 3. రాజుజిల్లేడు.

జిల్లేడు:-ఈ పత్రి చెట్టు యొక్క శాస్త్రీయ నామం Calotropis Procera.

ఔషధ గుణాలు:-

ఈ పత్రి యొక్క ఔషధ గుణాలు :

చర్మ సమస్యలను తగ్గిస్తుంది.
శరీర సమస్యలకు ఉపయోగపడుతుంది.
కీళ్ళ సమస్యలను తగ్గిస్తుంది.



ఈ ఆకు ఎరుపు, తెలుపు, రాజ అను మూడు రంగుల్లో లభిస్తుంది. ఆకారం అస్తవ్యస్తంగా ఉంటుంది. పరిమాణం మధ్యస్థం. ఈ చెట్టు గుబురుచెట్టుగా పెరుగుతుంది.
చెట్టంతా కొంచెము మదపు వాసన కలిగియుండును.
వేరు పొడవుగా నుండును. వేరు పైన గల చర్మము కూడా తెల్లని పాలు కలిగియుండును.
దూది వంటి నూగుతో కప్పబడిన శాఖలతో పెరిగే చిన్నపొద. 2-3 మీటర్ల ఎత్తు వరకు పెరుగును.
అండాకారం నుండి హృదయాకారంలో ఉన్న దళసరిగా పాలు కలిగిన సరళ పత్రాలు. క్రిందిభాగమున ఈనెలుకలిగి, తెల్లని నూగుకలిగి ఉంటాయి.
పార్శ్వ్ అగ్రస్థ నిశ్చిత సమశిఖి విన్యాసంలో అమరి ఉన్న తెలుపు లేడా గులాబీ రంగుతో కూడిన కెంపు రంగు పుష్పాలు. ఇవి గుత్తులు గుత్తులుగా పూయును.
కొడవలి ఆకారంలో ఉన్న జంట ఏకవిదారక ఫలాలు. పండి పగిలిన అందులో తెల్లని మృదువైన దూది యుండును.

జిల్లేడు:-జిల్లేడులో ప్రధానంగా రెండు రకాలు గలవు. ఒకటి ఎర్ర జిల్లేడు, 2. తెల్ల జిల్లేడు.

ఇతర ఉపయోగాలు:-



ఈ పత్రితో ఉన్న ఇతర ఉపయోగాలు :

పాలను పసుపుతో కలిపి ముఖానికి రాసుకుంటే ముఖవర్చస్సు పెంపొందుతుంది.
లేత జిల్లేడు చిగుళ్ళను తాటి బెల్లంతో కలిపి కుంకుడు గింజంత మాత్రలుగా చేసి ఆ నాలుగు రోజులు ఉదయం ఒకటి, సాయంత్ర ఒకటి చొప్పున సేవిస్తే స్ర్తీల బహిష్టు నొప్పులు తగ్గుతాయి.

Share:

కొండ పిండి చెట్టు

కిడ్నీలోగాని మూత్ర నాళాల్లో గాని రాళ్లు (స్టోన్స్) ఏర్పడి కొంత మంది అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు. కొంత మంది వేలాది రూపాయలు ఆసుపత్రులకు వెచ్చించి ఆపరేషన్లు చేయించుకుంటారు. మరికొంత మంది రాళ్లు ఏర్పడి వారు స్టోన్స్ కరిగిపోవడం కోసం మందులను వాడుతుంటారు. రాళ్ల సైజును బట్టి కొంతమందికి కరిగిపోవడం జరుగుతుంటుంది. మరికొంత మందికి ఆపరేషన్ తప్పనిసరి అవుతుంది. కాగా రాళ్లను కరిగించడానికి ఆయుర్వేదంలో మందును వినియోగిస్తున్నారు. పూర్వీకుల నుండి చెట్ల మందులు ఆలస్యంగా నైనా ఎక్కువగా పనిచేస్తాయని వాడుతుంటారు. ఇందుకు నిదర్శనమే కిడ్నీలో ఏర్పడిన రాళ్లను కరిగించడం కోసం కొండపిండి ఆకును వినియోగిస్తున్నారు. ఈ ఆకు పేరు ఎలా వచ్చిందోగాని పేరులోనే ఉంది కొండను పిండిచేసే చెట్టు. 5నుండి 8mmలోపు సైజు రాళ్లు కిడ్నీలో ఏర్పడినట్లు నిర్దారణ కాగానే కొండపిండి ఆకు రసం త్రాగడం ప్రారంభించాలి. ఉదయం పూట పరిగడుపున కొంత కొండపిండి ఆకును తీసుకొని దంచుకొని లేదా మిక్సిలో టీ కప్పు రసం తయారు చేసుకొని అందులో టీ స్పూన్ జిలుకర్ర, నవ్వోతు(పటికబెల్లం) పొడిగా తయారు చేసుకొని కలుపుకొని 5 రోజుల పాటు సేవిస్తే 15 రోజుల వరకు రాళ్లు కరిగి పోవడం లేదా రాళ్లు పడిపోవడం జరుగుతుంది. అంతకన్న ఎక్కువ రోజులు త్రాగిన కలిగే నష్టమేమి ఉండదు.


Share:

గుంట గలగర ఉపయోగాలు

గుంటకలగర లేదా గుంటగలగర ఒక విధమైన ఔషధ మొక్క. ఇది ఆస్టరేసి (Asteraceae) కుటుంబానికి చెందినది. దీని శాస్త్రీయనామం ఎక్లిప్టా ఆల్బా (Eclipta alba). నీటి కాలువలు, గుంటల పక్కన, తేమగల ప్రదేశాలలో నేలబారుగా పెరిగే కలుపు మొక్క గుంటగలిజేరు. గుత్తులుగా ఉన్న తెల్లని చిన్న పూలను పూస్తుంది. సంస్కృతంలో దీన్ని భృంగరాజ అంటారు. మార్కెట్లో చాలా తల నూనెలు గుంటగలగర ఆకులతో తయారు చేస్తున్నారు. వెండ్రుకలు రాలిపోకుండా కాపాడే గుణం దీనిలో ఉండటమే అందుకు కారణం. గుంటగలగర మొక్కలను వేళ్లతో సహా తీసి శుభ్రపరచి నీడలో ఎండబెట్టాలి. దీనికి మార్కెట్లో మంచి అమ్మకపు విలువ వుంటుంది. ఆధునిక పరిశోధనలలో ఇందులో కల ఎక్లిప్టిన్ అనే ఔషధతత్వానికి లివర్ ను బాగుచేయగల శక్తి ఉందని కనుగొన్నారు. ఆయుర్వేద వైద్య విధానంలో గుంటగలిజేరును ప్రధానంగా తల వెండ్రుకలు నల్లగా, వత్తుగా పెరగటానికి, లివరు, చర్మ వ్యాధులలో వాడుతారు.

ఇది ఉబ్బసము, బ్రాంకైటిస్, రుమాటిజమ్ నివారణలో, రక్తస్రావాన్ని అరికట్టడంలో, వెంట్రుకల పెరుగుదలకు వాడే మందుల్లో ఉపయోస్తారు.

పేను కొరుకుడు : తలపైన అక్కడక్కడ ఒక్కమారుగా వెండ్రుకలు రాలిపోయి మచ్చలు మచ్చలుగా అగుపించే దానిని సామాన్యంగా పేనుకొరుకుడు అంటారు. గుంట గలిజేరు మొక్కను వేరుతో సహా సేకరించి మెత్తటి ముద్ద అయ్యేట్లు నూరి పేనుకొరుకుడు గల ప్రదేశాల్లో పూయాలి. ఈ విధంగా ఒక వారం రోజులు చేస్తే వెండ్రుకలు రాలటం ఆగి పోయి కొత్త వెండ్రుకలు వస్తాయి.
చిన్న పిల్లల్లో దగ్గు : గుంటగలిజేరు ఆకులను నీటితో శుభ్రంగా కడిగి దంచి రసం తీయాలి. రెండు చుక్కల రసాన్ని ఒక టీ స్పూన్ (5 మి.లీ) తేనెలో కలిపి ఉదయం, సాయంత్రం తీసుకుంటే దగ్గు ఉపశమిస్తుంది. గొంతులో గరగర తగ్గిపోతుంది.



వెండ్రుకలు నల్లబారుట : గుంట గలిజేరు మొక్కను వేరుతో సహా మెత్తగా దంచి ముద్ద చేయాలి. దానికి నాలుగు రెట్లు నువ్వులనూనె లేక కొబ్బరినూనె కలిపి సన్నటి సెగపై మరిగించాలి. ఆ మిశ్రమంలోని తేమ ఇగిరిపోయాక నూనెను వడపోయాలి. ఈ గుంటగలగర నూనెను వరుసగా తలకు వాడితే చిన్న వయస్సులో నెరిసిన జుట్టు నల్లబడుతుంది. వెండ్రుకలు రాలిపోవడం ఆగి, కళ్లకు బలం కలుగుతుంది.
పురుగుకాట్లు : చిన్నచిన్న పురుగులు కరిచి అక్కడ దద్దు, వాపు, దురద రావచ్చు. గుంట గలిజేరు ఆకు రసాన్ని కరిచిన చోట పూస్తే వెంటనే ఉపశమనం కలుగుతుంది.
నోరు పూయుట : నోరు పొక్కి, కురుపులు ఏర్పడినప్పుడు పులుపు, కారం, ఉప్పు తినటం కష్టమవుతుంది. నాలుగు గుంట గలిజేరు ఆకులను శుభ్రంగా కడిగి నోటిలో ఉంచుకొని చప్పరిస్తే నోటిలో కురుపులు త్వరగా మానిపోతాయి.
Share:

శరీరాన్ని మైదా పిండి క్రమంగా చంపేస్తుందని తెలుసా..?

మనం బయట తినే చపాతి, దోశ, పరోట, రోటి, తండూరీ.. ఇలా అన్నింటిలోనూ ఎక్కువగా ఉండే పిండి పదార్థం ఏదైనా ఉందంటే అది మైదానే.. మైదా వాడితే పదార్థాలు చూడడానికి ఆకర్షణీయంగానూ, తినడానికి రుచిగానూ ఉంటాయి. దీంతో ఇక అంతా ఆ హోటల్ లో పలానాది తింటే చాలా బావుందని చెబుతుంటారు. కాని మైదా పిండి వాడడం మూలాన వచ్చే నష్టాలు తెలిస్తే మళ్లీ జన్మలో వాటి జోలికి వెళ్లరు.




మైదాలో విషపూరిత రసాయనాలు…
* మిల్లులో బాగా పోలిష్ చేయబడిన గోధుమ పిండి. పసుపు రంగులో ఉండే గోధుమ పిండిని Azodicarbonamide, Chlorine gas, మరియూ Benzoyl peroxide అనే రసాయనాలను ఉపయోగించి తెల్లగా చేస్తారు. 
* బెంజాయిల్ పెరాక్సైడ్ వాడుక చైనా ఐరోపా దేశాల్లో నిషేధించబడినది. మైదా లో Alloxan అనే విషపూరితమైన రసాయనం ఉంటుంది. అందువల్ల మైదా పిండి ముట్టుకోవడానికి మెత్తగాను, చూడటానికి తెల్లగానూ ఉంటుంది. 
* గోదుమ పిండితో పోల్చితే సగం లేదా మూడో వంతు ధరకే లభించే మైదాను ఇప్పుడు అన్ని బేకరీ, హోటల్ ఫుడ్స్ లో ఇష్టారీతిన వాడేస్తున్నారు.
మైదా తింటే ఆరోగ్యం ఇలా దెబ్బతింటుంది…
* మనం తిన్న ఆహారం జీర్ణం కావాలంటే అందులో తప్పనిసరిగా పీచు పదార్థం ఎంతోకొంత ఉండాలి. అది మైదాలో జీరో. కాబట్టి దానిని జీర్ణం చేయాలంటే మన జీర్ణాశయం అష్టకష్టాలు పడాలి. ఈ ప్రమాదంతో పేగుల్లో పుళ్లు సైతం ఏర్పడతాయి. అవి తీవ్రమైన ఇన్ఫెక్షన్లుగా మారితే కడుపులో తీవ్రమైన ప్రాణాంతక వ్యాధులకూ దారితీస్తాయి.
* సినిమా పోస్టర్లను అంటించడానికి మైదా పిండినే ఎందుకు ఉపయోగిస్తారంటే అది గోడకు అంత పర్ఫెక్టుగా అంటుకుపోతుంది. 
* ఆ పిండితో చేసిన పదార్థాలు జీర్ణంకాక మన పేగులకూ అలాగే అతుక్కుపోతాయి. దీంతో పేగుల్లో క్రిములు ఉత్పత్తి అవుతాయి. అవి ఇన్ఫక్షన్లను కలిగిస్తాయి.
* దీర్ఘకాలంలో క్యాన్సర్ వంటి రోగాలకూ దారితీస్తాయి.
* కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి.
* గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. 
* మహిళలు బ్రెస్ట్ సంబంధిత సమస్యలు ఎదుర్కొంటారు.
* కేవలం పిండి పదార్థం మాత్రమే ఉండే మైదాతో పొట్ట వస్తుంది. ఇక ప్రొటీన్లు చాలా నామ మాత్రంగా ఉంటాయి.
* మైదాలో glycamic index చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఒంట్లో బ్లడ్ షుగర్ లెవల్స్ అమాంతం పెరిగే ప్రమాదం ఉంది.
* రోజూ మైదాతో చేసిన ఫుడ్స్ తీసుకుంటుంటే షుగర్ వచ్చేందుకు ఆస్కారమిచ్చినట్టే.
* స్వలాభం కోసం కష్టమర్ల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి వారికి తగిన శాస్తి జరగాలంటే మనం తినడం తగ్గిస్తే సరిపోతుంది. 
* ఆరోగ్య స్పృహతో వ్యవహరిస్తే చాలు ఆ ఫుడ్స్ తినాలనిపించదు. కావాలంటే ట్రై చేసి చూడండి.. అందరికీ తెలసేలా షేర్ చేయండి.*
Share:

ఫంగల్ ఇన్ఫెక్షన్లను దూరం చేసే కరివేపాకు.

కరివేపాకులో హానికర సూక్ష్మజీవుల్ని నశింపజేసే గుణాలున్నాయి. తద్వారా ఇన్ఫెక్షన్లు తగ్గుముఖం పడతాయి.  పొట్టలోని విషపూరితాలను సైతం కరివేపాకు చక్కగా తొలగిస్తుంది. అజీర్తిని పోగొట్టి జీర్ణశక్తిని పెంచుతుంది.  కరివేపాకులో యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఎక్కువ. విరేచనాలు తగ్గాలంటే.. చిన్నరేగుపండు సైజులో కరివేపాకు ముద్దను మజ్జిగతో రెండుమూడుసార్లు తీసుకుంటే సరిపోతుంది.

  కరివేపాకులోని అనేక పోషకాలు శిరోజాలను సంరక్షిస్తాయి. అంతేకాదు, దీన్ని నూరి తలకు పెట్టుకుంటే చుండ్రు తగ్గుతుంది.  దగ్గూ కఫంతో బాధపడుతుంటే టీస్పూను కరివేపాకు పొడిని తేనెతో తీసుకుంటే ఫలితం ఉంటుంది.
 కరివేపాకులోని మంచి కొలెస్ట్రాల్‌ను పెంచి.. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.  కరివేపాకులోని పీచు కారణంగా రక్తంలో చక్కెర నిల్వలు కూడా తగ్గుతాయి. ఇది కొవ్వుని సైతం కరిగిస్తుంది. దాంతో బరువు కూడా తగ్గుతారు.
Share:

రోజ్ వుడ్ ఆకులు నమలి తింటే !

తెలిసిన వారైనా, అపరిచితులైనా సరే వారికి కేన్సర్ ఐతే అది ఏరకమైనదైనా సరే మీరు వారి ఇంటికి వెళ్ళండి, ఆ ఇంట్లో వారికైనా,లేక ఆ పేషంట్ కైనా నచ్చ చెప్పండి అది‌వారు వాడే మందులు వాడుతూ దానితో పాటు రోజ్ వుడ్ (Rose Wood) ఆకుల రసం 10 నుంచి 15 రోజులు తీసుకోవాలి, తరువాత రోజ్ వుడ్ ఆకులుని రోజూ నమలి తినటం మెుదలు పెట్టాలి ,చూస్తుండగానే మీకు రోగిలో అనూహ్యమైన మార్పు రావటం కనిపిస్తుంది. మరియు ఈ రోగం పూర్తిగా నయమౌతుంది. 


Share:

ఆషాడ మాసంలో మునగ కూర తినాలని పెద్దలు చెబుతారు.

మునగను ములగ అని కుడా అంటారు. శిగ్రు, శోభాంజన,కృష్ణగంధ,బహు లచ్చద అని సంస్కృతం  లో పిలుస్తారు. ఏడాదికి ఒక సారియైన ముఖ్యంగా ఆషాడ మాసంలో మునగ కూర తినాలని పెద్దలు చెబుతారు.




ములగాకు చాల బలకరమైంది. దానిలో 5,౦౦౦ యూనిట్ల అ విటమిన్ ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.ఇది మలాన్ని గట్టి పరుస్తుంది. అగ్ని దీపనాన్ని చేస్తుంది. కఫాన్ని, వాతాన్ని హరిస్తుంది. మిక్కిలి కాక చేస్తుంది. రక్త పిత్తాన్ని కలిగిస్తుంది. విద్రధిని, ప్లీహ వ్రానాన్ని పోగొడుతుంది. ఇది బహు పత్యకరి.
శరీరం లోని చేదు నీటిని బయటకు పంపడానికి ఇది పెట్టింది పేరు. ఇది దృష్టిమాంద్యాన్ని పోగొడుతుంది. స్రీలకు ఇది చాల మంచిది. 'ముట్టునీళ్ళ నాడు మునగాకు కూర' అని సామెత. అంటే ఇది ముట్టునీళ్ళ నాడు మునగాకు తినడం పత్యకరమై ఉందని అర్ధం.
Share:

తినేటపుడు నీరు తాగితే నష్టమేమిటి?

కొంతమంది నీరు తాగి వెంటనే తినడం మొదలు పెడతారు. మరికొందరు తినేటపుడు తాగితే, ఇంకొందరు తిన్నాక తాగుతారు. ఇలా నీటిని తాగటం జీర్ణక్రియకు ఇబ్బందిని కలిగించడమే. మనం తిన్న ఆహారాన్ని అరిగించడానికి పొట్టలో హైడ్రోక్లోరిక్‌ యాసిడ్‌ ఊరుతుంది. ఆ యాసిడ్‌ మన ఆహారంతో డైరెక్టుగా కలిస్తే ఆహారం త్వరగా అరిగి పిండిపిండిగా విడగొట్టబడుతుంది. ఇలా జరగకుండా, మనం తినేటపుడు తాగిన నీరు పొట్టలోనికి వెళ్లి, లోపల ఊరిన హైడ్రోక్లోరిక్‌ ఆమ్లాన్ని పలుచగా (యాసిడ్‌కి నీరు కలిపితే గాఢత లేదా పవర్‌ తగ్గిపోతుంది.) చేసేస్తుంది. దాంతో జీర్ణక్రియకు మామూలు కంటే రెట్టింపు సమయం పడుతుంది. 



తినేటపుడు నీరు తాగటం వల్ల వచ్చే నష్టాలు చూస్తే, భుక్తాయాసం రావటం, కడుపులో మంటలు రావటం, అజీర్ణం కలగటం, ఆహారం ఎక్కువ సేపు నిలువ ఉండి పులవడం, గ్యాసు తయారవడం, త్రేన్పులు ఎక్కువగా రావడం, పొట్ట సాగిపోవడం మొదలగునవి అన్నీ వస్తూ ఉంటాయి. తినేటపుడు నీటిని తాగడం అసహజం. పండ్లు, పచ్చి కూరలు తిన్నపుడు మీరు బాగా నమిలి తింటున్నారు కాబట్టి గొంతు పట్టడం గానీ, ఎక్కిళ్లు గానీ రావు. ఆహారాన్ని మెత్తగా పిండిపిండిగా నమిలి, మెల్లగా తింటూ ఉంటే తినేటపుడు నీటి అవసరం రాదు. కొత్తలో వారం, పది రోజులు కొంచెం ఇబ్బందిగా ఉన్నా మెల్లగా అలవాటు అయి, మీకు తిన్నాక ఎంతో హాయి అనిపిస్తుంది. బద్దలు, నీళ్లు కలిపి పోసి రోటిలో రుబ్బితే పిండి నలగదు కాబట్టే ముందు బద్దలను రుబ్బి ఆ తర్వాత నీరు కలుపుకోవడం మన అలవాటు. అలాగే ఇక నుంచి మీ పొట్టలో కూడా అలాగే రుబ్బుకోవడానికి ప్రయత్నించండి.
Share:

మొదటి ముద్దను కరివేపాకు పొడితో తింటే...?

తాలింపులో సుగంధద్రవ్యంగా కరివేపాకును వాడుతారు. ఈ విధంగా అవసరానికి మన ఇంట్లో లేకపోయినా పక్కింటి వాళ్ళనయినా రెండు రెమ్మలు అడిగి తీసుకొని మరీ వాడుకునే ఈ కరివేపాకును తినేటప్పుడు మాత్రం తీసి పక్కన పడేస్తూ వుంటారు. కరివేపాకు అంత తీసిపారేయదగ్గ పదార్ధం కాదు. కరివేపాకులో ఎన్నో ఔషధగుణాలు వున్నాయి.
ప్రతి యింట్లో వేపచెట్టు వుండాలని పెద్దలు చెబుతారు. వేపచెట్టు నుండి వీచే గాలి ద్వారానే పలు రోగాలు నయం అవతాయంటారు. అలానే కరివేపాకు చెట్టు నుండి వీచే గాలి కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వాతవరణం కాలుష్యభరితం అయినపుడు ఆ ప్రదేశాలలో కరివేపాకు చెట్టు నాటితే వాతవరణం శుభ్రపడుతుంది.

కరివేపాకు చెట్టులో ఆకులు, బెరడు, వేరు, గింజలు, పూలు అన్నీ ఔషధగుణాలు కలిగివున్నాయి. కరివేపాకు పేగులకు, ఉదరమునకు బలాన్నివ్వడమే కాక శరీరానికి కాంతిని కలిగిస్తుంది, రంగునిస్తుంది. ఆహార పదార్థాలకు రుచిని కలిగించడమే కాక, అజీర్తిని నివారించి ఆకలిని పుట్టిస్తుంది.
ఎలర్జీని కలిగించే వ్యాధులనూ, ఉబ్బసం, ఉదయాన్నే లేచిన వెంటనే తుమ్ములు ప్రారంభం అవుతన్నప్పుడు జలుబుతో తరచుగా బాధపడుతున్నవారూ, ప్రతిరోజ ఆహారంలో మొదటి ముద్దను కరివేపాకు పొడితో తినడం వలన ఎంతో ఉపయోగం వుంటుంది.
గర్భధారణ జరిగిన తరువాత కడుపుతో వున్న తర్వాత కడుపుతో వున్న తల్లికి, బిడ్డకు తగినంత రక్తం అందాలంటే మందులతోపాటు కరివేపాకు పొడిని కూడా యివ్వాలి. బాలింతలకు కూడా ఇది వాడవచ్చు. ఎలాంటి పథ్యము లేదు. రక్తవిరేచనాలు, జిగట విరేచనాలు, అవుతున్నప్పుడు కరివేపాకు పొడిని వట్టిది వాడకం కంటే మజ్జిగలో కలుపుకొని రెండు లేక మూడుసార్లు వాడితే మంచి ఫలితం వుంటుంది. గ్యాస్ ట్రబుల్ వున్నవారు, కడుపు ఉబ్బరంగా వుండి వాయువులు వెలువడుతుంటే వారు ఆహారంలో తరచుగా వాడుతుండాలి. 
మొలలు వ్యాధితో బాధపడే వారికి ఈ ఆకు బాగా పనిచేస్తుంది. కరివేపాకు చెట్టు బెరడు కూడా వైద్యానికి పనికివస్తుంది. దీనిని మెత్తగా నూరి కాస్తంత నీరు కలిపి దురదలు, పొక్కులు వున్నప్పుడు వాటిపై రాసి ఆరిన తరువాత స్నానం చేస్తే తగ్గుతాయి. కరివేపాకు కేన్సర్ వ్యాధిలో ఎంతో ఉపయోగకారి అని నవీన పరిశోధనలు చెబుతున్నాయి.
కరివేపాకు కారం తయారు చేసే విధానం: కరివేపాకు ఎక్కువ పాళ్ళు వుండే విధంగా వుంటే మంచి ఫలితం వుంటుంది. జీలకర్ర, ధనియాలు, ఎండబెట్టిన కరివేపాకు ఈ మూడింటినీ విడివిడిగా నేతిలో వేయించాలి. వీటిని మెత్తగా దంచి, మెత్తగా అయిన తర్వాత ఉప్పును తగినంత వేసి భద్రపరుచుకోవాలి. ఏదైనా బ్రేక్‌ఫాస్ట్, అన్నంలోను ఈ పొడిని కలపుకొని తినవచ్చు. మంచి ఫలితం వుంటుంది.
Share:

కర్పూరం గురించి..

కర్పూరం అనేది మనకి తెలిసినంతవరకు సుగంధంగానూ, కొన్ని వంటకాలలోనూ, హిందువులు తమ పూజాకార్యక్రమాలలో దేవునికి హారతి ఇవ్వడానికి ఉపయోగిస్తారు. ఇది మైనములా తెల్లగానూ పారదర్శకంగానూ ఉండే ఒక ఘాటైన వాసన గల పూజా ద్రవ్యము.
ఇది రసాయనాలతో కృత్రిమంగా తయారయింది అనుకుంటారు చాలామంది. కానీ, కర్పూరం చెట్టు నుండి ఉత్పత్తి అవుతుంది అన్నది అక్షర సత్యం. అండి కర్పూరం కాంఫర్ లారెల్ లేదా Cinnamomum camphora (కుటుంబం: లారేసీ ) అనే చెట్టునుండి లభ్యమవుతుంది. కర్పూరాన్ని ఆ చెట్ల ఆకులు, కొమ్మలనుండి తయారు చేస్తారు. అలాగే కొన్ని రకాలైన తులసి (కర్పూర తులసి) జాతులనుండి కూడా కర్పూరాన్ని తయారుచేస్తారు. కర్పూర చెట్ల కాండంమీద గాట్లు పెడతారు. ఆ గాట్లలోంచి పాలు వస్తాయి. ఆ పాలతో కర్పూరం తయారౌతుంది. కర్పూరం చెట్టు వంద అడుగుల వరకూ పెరిగే సుందరమైన నిత్య హరిత వృక్షం. చక్కని సువాసన కలిగిన పట్ట కలిగి ఉంటుంది. ఆకులు పొడవుగా ఉండి ఫిబ్రవరి, మార్చి నెలల్లో రాలతాయి . పువ్వులు చిన్నవిగా ఉంటాయి. పండ్లు ముదురు ఆకుపచ్చని రంగులో ఉండి అక్టోబర్‌లో పక్వానికి వస్తాయి. ఈ చెట్లు చైనా, జపాన్ దేశాల్లో విస్తారంగా పెరుగుతాయి. మన దేశంలో దీనిని నీలగిరి కొండల్లో పెంచుతారు. అలాగే మైసూర్‌లోనూ, మలబార్ ప్రాంతంలోనూ కర్పూరం చెట్లు కనిపిస్తాయి.


కర్పూరం చాలా రకాలుగా ఉంటాయి. ఒక్కో రకం ఒక్కో విధంగా మనకి ఉపయోగపడుతుంది.
పచ్చకర్పూరం: కర్పూరం చెట్టు వేర్లు, మాను, కొమ్మలను నీళ్లలో వేసి మరిగించి, డిస్టిలేషన్ పద్ధతిలో సేకరించే కర్పూరాన్ని పచ్చకర్పూరం అంటారు. దీనిని ఔషధ ప్రయోగాలకు వాడుకోవచ్చు. దీనిని ఎక్కువగా వంటలలో వాడతారు. కాటుకని ఈ పచ్చ కర్పూరంతోనే చేస్తారు. అంజనం వేయడానికి కూడా దీనినే వాడతారు.
హారతి కర్పూరం: టర్‌పెన్‌టైన్ నుంచి రసాయనిక ప్రక్రియ ద్వారా తయారుచేసే కృత్రిమ కర్పూరాన్ని హారతి కర్పూరం (C10H16O) అంటారు. దీనిని ఔషధ ప్రయోగాలకు వాడకూడదు.
రస కర్పూరం: చిన్న పిల్లలకి ఒంట్లో ఉన్న దోషాలు పోవడానికి ఆముదంతో కలిపి కర్పూరం పట్టిస్తారు. దానిని రస కర్పూరం అంటారు.
భీమసేని కర్పూరం: సహజముగా మొక్క నించి తయారుగా లభించే కర్పూరాన్ని భీమసేని కర్పూరం లేదా అపక్వ కర్పూరం అంటారు. దీనిని ఔషధ ఉపయోగాలకోసం విరివిగా వాడుతూ ఉంటారు.
సితాభ్ర కర్పూరం: ఇది తెల్లని మేఘంలాగా కనిపిస్తుంది కనుక దీనికి ఆ పేరు వచ్చింది.
హిమవాలుక కర్పూరం: ఇది మంచులాంటి రేణువులు కలిగి ఉంటుంది.
ఘనసార కర్పూరం: ఇది మేఘంలాంటి సారం కలిగినది. 
హిమ కర్పూరం: ఇది మంచులాగా చల్లగా ఉంటుంది.
ఇవే కాక ఉదయ భాస్కరము, కమ్మ కర్పూరము, ఘటికము, తురు దాహము, హిక్కరి, పోతాశ్రయము, పోతాశము, తారాభ్రము, తుహినము, రాత్రి కరము, విధువు, ముక్తాఫలము, రస కేసరము, ప్రాలేయాంశువు, చంద్ర నామము, గంబూరము, భూతికము, లోక తుషారము, శుభ్ర కరము, సోమ సంజ్ఞ, వర్ణ కర్పూరం, శంకరావాస కర్పూరం, చీనా కర్పూరం అని చాలా రకాల కర్పూరాలున్నాయి.
కర్పూరంవలన అసంఖ్యాకమైన ఆరోగ్య ఉపయోగాలు ఉన్నాయి. ఆయుర్వేద చికిత్సలో కర్పూరాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. అసలు కర్పూర సువాసన పీలిస్తే చాలు శారీరక రుగ్మతలన్నీ పోయినట్లు, సేద తీరినట్లు ఉంటుంది. మానసిక ప్రశాంతత చేకూరుతుంది. కొన్ని ముఖ్యమయిన ఆరోగ్య లాభాలు:
1. స్వల్ప గుండె సమస్యలు, అలసట సమస్యలకు కొద్ది మొత్తం కర్పూరం వాడితే ఫలితముంటుంది.
2. అన్ని రకాల ఆర్థరైటిస్, రుమాటిక్ నొప్పుల నివారిణిగా, నరాల సంబంధమైన సమస్యలు, వీపు నొప్పికి కూడా ఇది బాగా పనిచేస్తుంది.
3. పుండ్లు మానడానికి, పిల్లలకు గజ్జి, బొబ్బలు తగ్గడానికి, బ్రాంకయిటిస్, పలు రకాల ఇన్ఫెక్షన్లకు కర్పూరం ఉపయోగిస్తారు.
4. నాసికా సమస్యలకు యాంటిసెప్టిక్ గా కూడా దీనిని ఉపయోగిస్తారు. అందుకే విక్సు వెపోరబ్ (vicks veporub), ఆయింట్మెంట్లన్నిటిలోనూ, చర్మం పై పుతగాపూసే లేపనములలోను, శ్వాసనాళాల లో ఊపిరి సలపడానికి వాడే మందులలోను వాడుతారు.
5. కర్పూరం నూనెలో దూదిని తడిపి లెప్రసీ వ్యాధివల్ల ఏర్పడిన గాయంమీద ప్రయోగిస్తే త్వరితగతిన మానుతుంది.
6. కర్పూరాన్ని పొడిచేసి, నోటిలో ఉంచుకొని లాలాజలాన్ని మింగుతుంటే అతి దప్పిక తగ్గుతుంది.
7. కాలుష్యాన్ని పోగొట్టి, వాతావరణాన్ని స్వచ్ఛంగా మారుస్తుంది.
8. అంటువ్యాధులు ప్రబలకుండా చేస్తుంది.
9. కళ్ళకు మేలు చేస్తుంది కనుకనే కాటుకలో దీనిని వాడతారు. జలుబును, కఫాన్ని తగ్గిస్తుంది.
10 మానసిక జబ్బులను సైతం పోగొడుతుంది.
11.రక్తాన్ని శుద్ధి చేసి రక్త ప్రసరణ సవ్యంగా ఉండేలా చేస్తుంది.
12.అలజడులు, ఆందోళనలు తగ్గించి ఆనందాన్ని, ఆహ్లాదాన్ని ఇస్తుంది.
13. దేవాలయం లాంటి పవిత్ర ప్రదేశంలో కూడా స్త్రీ, పురుషుల మధ్య ఆకర్షణ కలిగే అవకాశం ఉంది. మనసు చంచలమయ్యే ప్రమాదం ఉంది. అలాంటి కామం, కోరికలు కలక్కుండా కర్పూరం మేలు చేస్తుంది.
14. పురుగుల మందులు, చెడువాసనల నిర్ములానికి, బట్టలను కొరికి తినే చెదపురుగులు, ఇతర క్రిమికీటకాలు చనిపోవడానికి, దోమల నిర్మూలనకి, కర్పూరాన్ని విరివిగా వాడుతారు.
15. తేలుకుట్టిన చోట ఆపిల్ రసంలో అరగ్రాము కర్పూరము కలిపి అరగంటకొకసారి బాధితునికి పట్టిస్తే తేలు విషం చెమట, మూత్రం రూపంలో బయటకు వచ్చేస్తుంది.
16. పెయింటింగ్, బాణాసంచా, సహజమైన పరిమళాలు, సబ్బులు తయారీలో కర్పూరం వాడుతారు.
17. కొన్ని రకాల సాఫ్ట్ డ్రింక్స్, దగ్గు మందులు, చాక్లెట్లలో కూడా సువాసనకోసం కర్పూరాన్ని ఉపయోగిస్తారు.
18. అలానే అరబకెట్నీళ్లలో రెండు గుప్పెళ్ల వేపాకు, కర్పూరం వేసి ఆవిరి వచ్చే వరకూ మరిగించి ఇంటిని తుడిస్తే ఫ్లోర్మీద ఈగలు వాలవు.
19. కర్పూరం ఉన్న పేస్ట్లను వాడటం వలన పంటి దుర్వాసన పోయి దంతాల మధ్య సూక్ష్మజీవులు నశిస్తాయి.
20. కొన్ని రాష్ట్రాల్లో కర్పూరాన్ని త్రాగే నీటిలో కూడా కలుపుకుని మరీ త్రాగుతారట. తద్వారా కలుషిత నీరు సైతం శుభ్రపడి స్వచ్ఛంగా ఉంటాయట.
Share:

ముల్లంగి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..:-

జాండిస్(కామెర్ల)నుండి కాపాడుతుంది: ముల్లంగిని తినడం వల్ల లివర్ మరియు కడుపును మంచి కండీషన్ లో పెడుతుంది. అంతే కాదు, శరీరంలోని రక్తాన్ని శుభ్రం చేస్తుంది. ఇంకా ఎర్రరక్తకణాలకు ఆక్సిజన్ ను సప్లై చేస్తుంది. ముల్లంగి ఆకులను మరియు బ్లాక్ రాడిష్ ను జాండిస్ నివారణకు ఉపయోగిస్తారు.


పైల్స్(మెలలు)నివారణకు: ముల్లంగి శరీరంలోని విషాలను బయటకు నెట్టేసే గుణాలు చాలా ఉన్నాయి. ఇంకా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పైల్స్ నివారణకు బాగా సహాయపడుతుంది. పైల్స్ అధికంగా కాకుండా అడ్డుకుంటుంది. ముల్లంగి జ్యూస్ మన జీర్ణక్రియకు బాగా సహాయపడి పైల్స్ రాకుండా అడ్డుపడుతుంది.

మూత్ర సంబంధిత వ్యాధులను కంట్రోల్ చేస్తుంది: ముల్లంగిలో ఉండే డ్యూరెటిక్, ఇది శరీరంలో యూరిన్ ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది. శరీరంలో ఏర్పడే మలినాలను తొలగించడానికి, మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్ ను తగ్గించడానికి మరియు యూరినేటింగ్ సమయంలో ఏర్పడే బర్నింగ్ సెన్షేషన్ వంటి వాటికి నివారిణిగా పనిచేస్తుంది. ముల్లంగిని తరచూ ఆహారంతో తీసుకోవడం వల్ల శరీరంలో మలినాలను బయటకు పంపడానికి సహాయపడే కిడ్నీలు మరియు యూరినరీ సిస్టమ్ ఇన్ఫెక్షన్ బారిన పడకుండా కాపాడుతుంది.
బరువు నియంత్రణ: బరువు తగ్గాలనుకొనే వారికి ముల్లంగి చాలా ఉపయోగకరం. ముల్లంగిలో జీర్ణక్రియ సక్రమంగా జరిగి విరేచనము సాఫీగా జరిగేందుకు ఉపయోగపడే పీచుపదార్థం మరియు కార్బోహైడ్రేట్స్ తో కలిగిన నీరును కలిగి ఉంటుంది. అందువల్ల బరువు పెరుగేందుకు సహకరించదు. ముల్లంగి క్యాలరీలు పెంచ కుండానే ఆకలిని సంత్రుప్తి పరుస్తుంది.
క్యాన్సర్ నివారిణి: ముల్లంగిని మన డైలీ డయట్ లో చేర్చుకోవడం వల్ల వివిధ రకాల క్యాన్సర్ (కోలన్ క్యాన్సర్, స్టొమక్ క్యాన్సర్, కిడ్నీ కాన్సర్, మరియు ఓరల్ క్యాన్సర్ )లను రాకుండా కాపాడుతుంది.
Share:

Labels

Blog Archive