అత్తిపత్తి ఆకులు ముట్టుకుంటే ఎందుకు ముడుచుకుంటాయి?

అత్తిపత్తి:- అత్తిపత్తి లేదా సిగ్గాకు (ఆంగ్లం Touch-me-not) ముట్టుకుంటే ముడుచుకునే లక్షణం గల ప్రాకే మొక్క. సంస్కృతంలో నిద్రభంగి, లజ్జాకు అని, హిందీలో లాంజోతి, చుయిముయి, షర్మాని అని, తమిళంలో తోట్టసినింగి, నిన్నసినింగి, అని తెలుగులో నిద్రగన్నిక, నిసిగ్గుచితక అని, లాటిన్ లో Neptuniao Leracea & Mimosa Pidica (Sensitive Plant) అని అంటారు ఇది ఫాబేసి కుటుంబానికి చెందినది. దీని శాస్త్రీయనామం మైమోసా ప్యూడికా (లాటిన్లో ప్యూడికా అంటే సిగ్గు అని అర్ధం). ఈ మొక్కను కేవలం దాని విలక్షణతకై పెంచుకుంటుంటారు. అత్తిపత్తి ఆకులు ముట్టుకున్న వెంటనే లోపలివైపుకు ముడుచుకొని వాలిపోతాయి. మళ్లీ కొన్ని నిమిషాల్లో తిరిగి యధాస్థితికి చేరతాయి. దక్షిణ అమెరికా మరియు మధ్య అమెరికా ప్రాంతాలకు స్థానికమైన ఈ మొక్క, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సమశీతోష్ణ ప్రాంతాలన్నింటిలో కలుపుమొక్కగా పెరుగుతుంది.

అత్తిపత్తి ఆకులు మన చేతితో తాకినా, ఏదైనా కీటకం వాలిగా, నీటిచుక్కలు పడినా, పెద్దగా గాలి వీచినా వెంటనే ముడుచుకొనిపోతాయి. అయితే యధాస్థితికి రావడానికి అరగంట నుండి గంట వరకు పడుతుంది. దీనికి కారణం ఆకులు కొమ్మను కలిసే ప్రదేశంలో మందంగా బుడిపెలా ఉండే పత్రపీఠం. మనం ఆకుల్ని తాకినప్పుడు దీనిలోని మృదుకణజాలం నుండి నీరు కాండంలోనికి వెళ్ళి ఫలితంగా పటుత్వం తగ్గిపోయి ఆకులు వాలిపోతాయి. కొంత సమయానికి కాండం నుండి నీరు బుడిపెలోనికి చేరి ఆకులు తిరిగి యధాస్థితికి వస్తాయి.




దీనిలో కొన్ని ప్రత్యేక నిర్మాణాలు ఉన్నాయి. ఆకుల కింద ద్రవంతో నిండిన సంచులుంటాయి. ఆ సంచులలో ద్రవం ఉన్నంత వరకు ఆకులు విచ్చుకొని వుంటాయి. ఎప్పుడైతే ఆకులపై ఉన్న స్పర్శ గ్రాహకాలు స్మర్శని గ్రహిస్తాయో అవి వెంటనే ఆ సంకేతాలను సంచులకు పంపుతాయి. అప్పుడు సంచులలో నుండి ద్రవం బయటకు (మొక్క కొమ్మలోపలికి) వెళ్లి పోతుంది. దాంతో ఆకులు ముడుచుకు పోతాయి. మరల కొద్దిసేపటికి సంచులలో ద్రవం నిండి ఆకులు విచ్చుకొంటాయి. ఇది ఒక రక్షణ పద్ధతి. పశువులు, జంతువులు ఆకులను తాకగానే ముడుచుకోవటం వలన మొక్క ఎండిపోయినట్లు కనిపిస్తుంది. దీని వల్ల జంతువులు తినకుండా వెళ్లిపోతాయి. మరికొన్ని మొక్కలు రాత్రిళ్ళు వాటంతట అవే ఆకుల్ని ముడుచుకుంటాయి.

అత్తిపత్తి ఉపయోగాలు:-

ఈ మొక్కలో వుండే రసాయనం మైమోసిన్ (ఆల్కలాయిడ్).

రక్త శుద్ధి చేస్తుంది.
ముక్కు నుండి కారే రక్తాన్ని ఆపుతుంది
స్త్రీరోగాలను హరించి వేస్తుంది.ఋతురక్తాన్ని, మూత్రాన్ని సాఫీగా జారీచేస్తుంది,
ఇది వాతాన్ని హరిస్తుంది.
పాత వ్రణాలనుమాన్పుతుంది.
మధుమేహ రోగాల్ని, ములవ్యాధిని, బోధకాలును, కామేర్లను, పోడలను కుష్టును, విరేచనాలను, జ్వరమును, గుండెదడను, శ్వాసకాసాలను, తుంటి నొప్పిని, ఉబ్బరోగం వంటి వాటిని తగ్గిస్తుంది.
అత్తి పత్తి - గుణ ప్రభావాలు : ఇది వాతాన్ని హరిస్తుంది, రక్త శుద్ధిచేస్తుంది, ఋతురక్తాన్ని, మూత్రాన్ని సాఫీగా జారీ చేస్తుంది. ముక్కునుండి కారే రక్తాన్ని ఆపుతుంది. పాత వ్రణాలను మాన్పుతుంది..మేహ రోగాలను, మూల వ్యాధిని, బోదకాలును, కామెర్లను, పొడలను, కుష్ఠును, విరెచనాలను, జ్వరమును, గుండెదడను, శ్వాసకాలను, తుంటినొప్పిని, ఉబ్బురోగాన్ని, స్త్రీరోగాలౌ హరించి వేస్తుంది.

వీర్యహీనతకు - బ్రహ్మాస్త్రం : అత్తపత్తి గింజలు, చింతగింజలపప్పు, నీరుగొబ్బిగింజలు సమంగా తీసుకొని మఱ్ఱిపాలలో ఒకరాత్రి నానపెట్టి తరువాత గాలికి ఆరపెట్టి మెత్తగానూరి శనగ గింజలంత మాత్రలుచేసి గాలికి ఎండపెట్టి నిలువ చేయాలి. రెందు పూటలా పూటకు మూడు మాత్రలు నీటితో వేసుకొని వెంటనే నాటుఆవుపాలు కండచక్కెర కలిపి తాగాలి. నలభై రోజుల్లో వీర్యము పోవడం, శిఘ్రస్కలనం, నపుంసకత్వం, అంగబలహీనత హరించి ధాతుపుష్టి కలుగుతుంది. వేడి, పులుపు, కారం పదార్థాలు నిషేధించి బ్రహ్మచర్యం పాటించాలి.
Share:

No comments:

Post a Comment

Labels

Blog Archive